పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన అనంతరం, భారత్.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిపింది.ఈ ఆపరేషన్కు అధికారికంగా “ఆపరేషన్ సిందూర్” అనే పేరు పెట్టారు. ఈ దాడుల్లో భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన “సూసైడ్ డ్రోన్లు” (Suicide Drones) ను వినియోగించినట్లు సమాచారం.
ఈ దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లను అధికారికంగా Low-Cost Miniature Swarm Drones లేదా Loitering Munition Systems (LMS) అంటారు. బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ మరియు ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘స్కైస్ట్రైకర్’ (SkyStriker) అనే వేరియంట్ వాడినట్లు భావిస్తున్నారు.
సాంప్రదాయ UAVలతో పోలిస్తే, ఈ లాయిటరింగ్ మ్యూనిషన్లు లక్ష్యాన్ని కొద్దిసేపు గమనించి, ఖచ్చితంగా దాడి చేయగలవు. ప్రతి స్కైస్ట్రైకర్ డ్రోన్ 5 కిలోల లేదా 10 కిలోల వార్హెడ్ను మోయగలదు.దీని పని పరిధి సుమారు 100 కిలోమీటర్లు. శబ్దం తక్కువగా ఉండి రహస్య ఆపరేషన్లకు అనుకూలంగా ఉంటుంది.
ఇది టార్గెట్ను గుర్తించి, ట్రాక్ చేసి, దానిని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. 2021లో భారత సైన్యం అత్యవసరంగా సుమారు 100 స్కైస్ట్రైకర్ డ్రోన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇవి బెంగళూరు పశ్చిమ భాగంలో ఉన్న పరిశ్రమల కేంద్రంలో తయారవుతున్నాయి. ఇవి ప్రత్యేకించి ఖచ్చితమైన దాడులకు ఉపయోగపడతాయి. అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఈ డ్రోన్ల వినియోగాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
Also Read:Odela 2:ఓటీటీలోకి ఓదెల 2!

