సినీ కార్మికుల కోసం అల్లు అర్జున్ రూ.20ల‌క్ష‌ల విరాళం

227
allu arjun
- Advertisement -

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ప్ర‌భావం వ‌ల్ల పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా బంద్ కావ‌డంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ పెద్ద‌లు త‌మ వంతు స‌హాయం చేస్తున్నారు.

తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సి.సి.సికి రూ.20 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. గ‌తంలో ఈయ‌న క‌రోనా నిర్మూల‌న కోసం రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేర‌ళ రాష్ట్రానికి క‌లిపి రూ. 1.25 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున‌లు కోటి రూపాయ‌లు విరాళం అందించారు. సినీ కార్మికుల‌ను ఆదుకోవాలంటూ వారు విజ్నప్తి చేస్తున్నారు.

- Advertisement -