మాజీ ఎంపీ కవితకు థ్యాంక్స్‌:విద్యార్థులు

217
kavitha
- Advertisement -

బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ నిమిత్సం నంద్యాల వెళ్లిన తెలంగాణ విద్యార్థులు లాక్ డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యను మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే స్పందించి స్ధానిక ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డితో మాట్లాడి స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌కు చేరిన విద్యార్ధులు మాజీ ఎంపీ కవితకు థ్యాంక్స్ చెప్పారు. తాము స్వస్థాలకు చేరుకునేలా సహాయ సహకారాలు అందించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

మొత్తం 614 మంది విద్యార్ధులు మాజీ ఎంపీ కవిత చొరవతో తమ స్వస్థలాలకు చేరుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -