స్వీడన్‌లో ట్రక్కు దాడి..

233
Stockholm ‘Terrorist’ Truck Attack
- Advertisement -

స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే బిజీ మార్కెట్లో ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.

సిటీలోని అతిపెద్ద పాదచారుల స్ట్రీట్‌గా పేరుగాంచిన అహ్లెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ వద్ద ప్రమాదం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి పక్కనే భారత రాయబార కార్యాలయం ఉంది. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ గాయపడలేదని అక్కడి భారత రాయబారి మోనికా మెహతా వెల్లడించారు. పోలీసులు ప్రమాదస్థలాన్ని బ్లాక్‌ చేసి వాహన రాకపోకలను నిలిపివేశారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా దాడులకు పాల్పడేందుకు ఈ చర్యకు దిగారా అనే విషయం తెలియాల్సి ఉంది.

 Stockholm ‘Terrorist’ Truck Attack

ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.స్వీడన్ ప్రజలకు భారత్ బాసటగా నిలుస్తుందన్నారు.

 Stockholm ‘Terrorist’ Truck Attack  Stockholm ‘Terrorist’ Truck Attack  Stockholm ‘Terrorist’ Truck Attack

- Advertisement -