ఈ సినిమా మాకు న‌చ్చింది.. మీకూ న‌చ్చుతుంది..

115
- Advertisement -

నాకు గుర్తుండిపోయే చిత్రమిదని..సినిమా మాకు న‌చ్చింది. మీకూ న‌చ్చుతుందని అన్నారు హీరో రాజ్‌తరుణ్‌. రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద స‌మ‌ర్ప‌కులు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని హోలీ కానుక‌గా ఈరోజు విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్యతిథి గా విచ్చేసిన వ‌రుణ్‌తేజ్‌, ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి తో క‌లిసి బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు.

ఈ వేడుక రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ, నాకు ఎప్ప‌టికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగ‌స్త్య రెండేళ్ళు ఈ సినిమాకే ప‌నిచేశాడు. ఇంద్ర‌జ‌, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిశోర్ మొద‌లైన‌వారితో ప‌నిచేయ‌డం గొప్ప‌గా వుంది. ఇందులో నేను బాగా న‌టించానంటే కార‌ణం వ‌ర్ష‌. ద‌ర్శ‌కుడు శాంటోతో ప‌నిచేయ‌డం హ్యాపీగా వుంది. సినిమా మాకు న‌చ్చింది. మీకూ న‌చ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రామ్‌కామ్ సినిమా ఇద‌ని` తెలిపారు.

- Advertisement -