సీఎం జగన్‌తో జక్కన్న ప్రత్యేక సమావేశం..

37
- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో సోమవారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన భేటీలో సీఎం జ‌గ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నానిల‌తో రాజ‌మౌళి, దాన‌య్య భేటీ అయ్యారు. త్వ‌ర‌లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధ‌ర‌లు, బెనిఫిట్ షో త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా,ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 25న థియేటర్లలో సందడి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- Advertisement -