పింక్ టెస్టు: శ్రీలంకపై భారత్‌ భారీ గెలుపు..

122
- Advertisement -

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా చెలరేగిపోయింది. 447 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలుపు సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ డే నైట్ టెస్టులో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటింది. లంక సారథి దిముత్ కరుణరత్నే (107) సెంచరీ కొట్టినా ప్రయోజనం దక్కలేదు.

ఓవర్ నైట్ స్కోరు 28/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక ఓ దశలో సజావుగానే ఆడుతున్నట్టు కనిపించింది. అయితే, 54 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ను అశ్విన్ అవుట్ చేయడంతో లంక పతనం షురూ అయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో కుదురుకోకపోవడంతో భారీ ఓటమి తప్పలేదు. అశ్విన్ 4 వికెట్లు తీయగా, బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.

- Advertisement -