శ్రీరాంసాగర్‌,జురాలకు పొటెత్తిన రవద

79
srsp
- Advertisement -

భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జురాలకు వరద పొటెత్తింది. ఎగున కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,94,200 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా అధికారులు 36 గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1087.70 అడుగులు ఉన్నది.

కర్ణాటకలో వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు జూరాలకు చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.43 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

- Advertisement -