తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: శ్రీనివాస్ గుప్త

358
Srinivas Gupta
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త నాగోల్ లోని ఆయన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఉద్యమంలో గానీ నేడు పాలనలో గానీ తెలంగాణ బిడ్డల మేలుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

Srinivas Gupta

అమరవీరుల త్యాగం, కేసీఆర్ పోరాట ఫలంతో దశాబ్దాల కలను నిజం చేసుకున్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా సంక్షేమాభివృద్ధిలో దుసుకుపోతున్నది. మూడున్నర కోట్లమంది కలలను నిజం చేసిన ఆయన నేడు ప్రజలను సంక్షేమ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతీ తెలంగాణ బిడ్డకు రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఐవీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -