దసరా కల్లా ప్యాకేజీ-9 పనులను పూర్తి చేయాలి..

416
minister ktr
- Advertisement -

వచ్చే దసరా నాటికి ప్యాకేజీ పనులను వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో ప్యాకేజీ-9 సొరంగ మార్గం, బండ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సొరంగ మార్గం పనులు, లైనింగ్, పంప్ హౌజ్ నిర్మాణం పనులను మొదట పరిశీలించారు. పనులు ఆశించిన మేరా వేగంగా సాగడం లేదని మంత్రి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. పనులు మరింత వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బండారు పనులను పరిశీలించిన మంత్రి ప్రగతిని క్షేత్రస్థాయిలో పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్యాకేజీ-9 పనులను వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే దసరా కల్లా ఎగువ మానేరు జలాశయం గోదావరి జలాలతో నింపి రైతుల పంట పొలాలకు సాగు జలాలను అందించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు కోసం సేకరించిన అటవీ భూములలో పనులు చేపడితే అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సేకరించిన అటవీ భూమికి బదులుగా ఇదివరకే వారికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చామన్నారు. అటవీ అధికారులు ఏమైనా నా ఇబ్బందులు సృష్టిస్తే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని అధికారులకు కలెక్టర్‌కు మంత్రి సూచించారు.

మలకపేట గ్రామాన్ని ఆనుకుని ఉన్న బండ్ వద్ద సీపేజి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని మంత్రి ఇరిగేషన్ అధికారులకు సూచించారు మల్కపేట జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నందున ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఆరు బండ్ లలో ప్రతి బండ్ కు ప్రత్యేక థీమ్‌తో ఆహ్లాదం కలిగించే పూల మొక్కలను హరితహారంలో భాగంగా నాటాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ తొమ్మిది పనుల పరిశీలనలో మంత్రి వెంట కలెక్టర్ కృష్ణ భాస్కర్ , అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, శిక్షణ కలెక్టర్లు సత్య ప్రసాద్ రిజ్వాన షేక్ బాషా, ప్యాకేజీ9 కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

- Advertisement -