టీ20 సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక..

110
sl
- Advertisement -

వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది శ్రీలంక. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20లో భారత్‌ను మట్టికరిపించి విజయం సాధించింది. భారత్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత్ విధించిన 82 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కొల్పోయి 14.3 ఓవర్లలోనే చేధించింది. టీమిండియా బౌలింగ్‌లో రాహుల్ చహర్ ఒక్కడే మూడు వికెట్లు తీసినప్పటికి లాభం లేకుండా పోయింది.

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, భువనేశ్వర్ కుమార్ మాత్రమే రెండు అంకెల స్కోర్ చేయగా మిగితా ఆటగాళ్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ నాలుగు వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు.

- Advertisement -