రేపట్నుంచి వన్డే పోరు…

70
- Advertisement -

శ్రీలంకతో మూడు వన్డేలో భాగంగా సోమవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రేపటి నుంచి ప్రారంభంకానున్న 3వన్డేల సిరీస్‌కు భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడన్న నమ్మకంతో ఉన్న జట్టుకు…చివరి నిమిషంలో నిరాశమిగిల్చాడు.

గతేడాది  సెప్టెంబర్‌లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యారు. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌లో కూడా బుమ్రా చోటు కోల్పోయారు. బీసీసీఐ ఇప్పటికే 2023వ సంవత్సరంలో మొదటి మూడునెలల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటగా శ్రీలంక న్యూజిలాండ్ ఆస్ట్రేలియా హోమ్ టూర్‌లో శ్రీలంకతో తలపడే జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది.

భారత జట్టు:రోహిత్‌శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్‌(వికెట్ కీపర్‌), హార్ధిక్ పాండ్యా (వైస్‌కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్దీప్ యాదవ్‌, అక్షర్ పటేల్‌, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీలంక జట్టు:దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుసల్ మెండిస్ (వైస్‌కెప్టెన్), చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, వనిందు హసరంగా, అషెన్ బండార, మహేశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ఎఫ్ నుషాన్‌ మదుషాన్, దిల్షాన్ మదుషాన్, దునిత్ వెల్లలాగే, ప్రమోద్‌ మదుషన్, లహిరు కుమార.

ఇవి కూడా చదవండి…

రెజ్లింగ్‌కు పూర్వ వైభవం…

సూర్య క్లాసిక్…లంక చిత్తు

జనవరి14న రానున్న వారసుడు:దిల్‌ రాజు

- Advertisement -