రెజ్లింగ్‌కు పూర్వ వైభవం…

56
- Advertisement -

రాష్ట్ర మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్లు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక హింద్ కేసరి రెజ్లింగ్ ముగింపు పోటీలను తిలకించారు. అనంతరం విజేతలైన రెజ్లింగ్ క్రీడాకారులకు ‘ గధ’ లను బహుకరించారు.

ఈ సందర్భంగా మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం రెజ్లింగ్, ఫూట్ బాల్, హాకీ, కబడ్డీ లాంటి ఎన్నో క్రీడా అంశాల్లో గతంలో పేరు గడించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రెజ్లింగ్ ను నిర్లక్ష్యం చేశారన్నారు. *రెజ్లింగ్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.* హైదరాబాద్ లో హింద్ కేసరి ఛాంపియన్ షిప్ ను రెండు సార్లు జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో రెజ్లింగ్ అకాడమీ ల ఏర్పాటు కు కృషి చేస్తామన్నారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ క్రీడా పట్ల చిన్న వయస్సు నుండే శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడా మైదానాలలో రెజ్లింగ్ కోర్ట్ లను ఏర్పాటు చేసి ప్రోత్సహం అందిస్తామన్నారు. తెలంగాణ ను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేలా స్పోర్ట్స్ పాలసి ని రూపొందిస్తున్నామన్నారు మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్.

ఈ సందర్భంగా రెజ్లింగ్ పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హింద్ కేసరి నిర్వాహకులు, పలువురు మాజీ పైల్వాన్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -