SR‌ నగర్ సిఐ బండారం బయటపెట్టిన నటి శ్రీసుధ..

268
sri sudha
- Advertisement -

ఎస్‌ఆర్‌ నగర్‌ మాజీ ఇన్‌స్పెక్టర్‌ మురళీ కృష్ణపై నటి శ్రీసుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి మురళీ కృష్ణ డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి శ్రీ సుధ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసు దర్యాప్తు కోసం మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని శ్రీసుధ తెలిపారు. ఈ కేసులో శ్యామ్‌ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతోపాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్‌ సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో మాట్లాడిన సాక్షాలను కూడా ఆమె ఏసీబీకి అందజేశారు. దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు.. సీఐ మురళి కృష్ణపై కేస్ నమోదు చేశారు.

- Advertisement -