శ్రీరెడ్డి మళ్లీ బూతు పురాణం…ఈసారి టార్గెట్ హైపర్ ఆది..!

658
sri reddy aadi
- Advertisement -

జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిని టార్గెట్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ఫేస్ బుక్ వేదికగా ఆదిని పరుష పదజాలంతో దూషించింది. సీనియర్ జర్నలిస్టు కాటా సుబ్బరావుపై జబర్దస్త్ కార్యక్రమంలో ఆది వేసిన సెటైర్లకు ఘాటుగా రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి జర్నలిస్టుల జోలికొస్తే కోసేస్తా అని వార్నింగ్ ఇచ్చింది.

ఆదిగా ఈ మధ్య పొట్టతో పాటు గు.. కూడా బాగా బలిసిందిరా. వ..లు వలిసేస్తాం జాగ్రత్త. కబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా?? కబర్దస్త్ లేకపోతే కుక్కలు చింపిన విస్తరి నీ బతుకు. ఒళ్లు జాగ్రత్త. సు.. కోసేస్తా బిడ్డ. కాగితం పులి గాడు వీడు. జర్నలిస్ట్ జోలికొస్తే ఉ.. పోయిస్తాం బిడ్డ అని పేర్కొంది.

తన యూ ట్యూబ్ ఛానల్‌ కుండబద్దలు ద్వారా ఆదిపై సెటైర్లు వేశారు కాటా సుబ్బరావు. టీవీ9లో నిర్వహించిన ఒక షోలో పాల్గొన్న ఆది జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అంటే తాటతీస్తాం అని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే ఆదిపై మండిపడుతూ కామెంట్ చేశారు సుబ్బారావు. దీనికి ప్రతిగా జబర్దస్త్ స్కిట్‌లో తీటా సుబ్బారావు అని సంబోధిస్తూ సెటైర్లు వేశాడు. తాట తీస్తానంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఆదికి వార్నింగ్ ఇస్తూ కామెంట్ పోస్టు చేసింది శ్రీరెడ్డి.

- Advertisement -