ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..!

85
covid
- Advertisement -

థర్డ్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని నీతి అయోగ్ సభ్యులు వీకే పాల్ తెలిపారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నా…కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆందోళన కర పరిస్థితి నెలకొందన్నారు.

కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం… 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను పంపినట్టు వెల్లడించారు. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్‌ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయని తెలిపారు. కరోనా కట్టడిని తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు.

ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు,మెడికల్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలను సమీక్షిస్తారని వెల్లడించారు. సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని….కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

- Advertisement -