రాఖీకి వస్తున్న జై’లవ’కుశ

190
Special Surprise on Rakhi from Jai Lava Kusa team
- Advertisement -

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌ విడుదలైన 48 గంటల్లోనే రికార్డులు సృష్టించింది.చిత్ర యూనిట్ రాఖీ సంద‌ర్భంగా ల‌వ పాత్ర‌ని ప‌రిచ‌యం చేయ‌నుంద‌ట‌. ఆగ‌స్ట్ 7 ఉద‌యం 10.35 ని.ల‌కు ల‌వ కుమార్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరికల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఎన్డీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెపుడా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకను కూడా చిత్ర యూనిట్ త్వరలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేసిందట. తాజా సమాచారం ప్రకారం జై లవకుశ ఆడియో రిలీజ్ డేట్‌ను ఆగస్టు 12 న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -