మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాస గృహంలో మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్ల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ , శ్రీశైలం , ఏడుపాయల , కీసర పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ,ఈడి మునిశేఖర్ , సీటీఎం శ్రీధర్ , ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప తదితరులు హాజరయ్యారు.
Also Read:శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం..