పీవీ వ్యక్తి కాదు శక్తి: స్పీకర్ పోచారం

172
pocharam
- Advertisement -

మాజీ ప్రధాని పీవీ నరసింహారవు 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి…..వారు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు సూచనలు మన వెంట ఉన్నాయి..శత జయంతి ఉత్సవాలు సీఎం కేసీఆర్, ఎంపి కేకే ఆధ్వర్యంలో గొప్పగా జరుగుతున్నాయన్నారు.

దేశానికి ఒక దిక్సూచి పీవీ నర్సింహారావు..భారత దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు పీవీ అన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆయన కు మనం ఇచ్చే ఘనమైన నివాలి….ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పెద్ద ఎత్తున పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేశవరావు.పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు,దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

పీవీకి భారత రత్న ఇవ్వాలని ఎన్ ఆర్ ఐ కోరుతోంది..మేము కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భారత రత్న ఇవ్వాలని ఒక తీర్మానం కేంద్రానికి చేసి పంపుతాం..పీవీ పేరుతో ఒక స్టాంప్ ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు.

- Advertisement -