జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం..!

8
- Advertisement -

జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం కానుంది. ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఈ సదస్సుకు హాజరుకాలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా పాజిటివ్ కారణంగా తాను ఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని వెల్లడించారు.

ఇక అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. అమెరికాతోపాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాల నేతలు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది.

Also Read:ఈ శతాబ్దపు విజయం..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు

- Advertisement -