మొక్కలు నాటిన ఎస్పీ రంజన్ రతన్‌ కుమార్…

299
gic
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమములో భాగంగా రాజ్యసభ సభ్యులు ఎంపి,గౌరవ శ్రీ సంతోష్ కుమార్ ప్రవేశ పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వనపర్తి జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు. IPS గారు మొక్కలను నాటి జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారికి గ్రీన్ ఛాలెంజ్ చేసిన సందర్భంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ. జె. రంజన్ రతన్ కుమార్ వనపర్తి ఎస్పీ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ గారు జోగుళాoబ గద్వాల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శృతి ఓఝా గారికి, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి రెమా రాజేశ్వరి గారికి, నాగర్ కర్నూల్ ఎస్పీ శ్రీ సాయి శేఖర్ గారికి అలాగే వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ ఎం. నారాయణ గారికి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు హారతహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది అని ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు యంపీ,శ్రీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లను హరిత వనాలుగా తీర్చిదిద్దడ మే లక్ధ్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు.

- Advertisement -