మొక్కలు నాటిన కామారెడ్డి ఎస్పీ శ్వేత…

244
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చాలెంజ్‌ను స్వీకరించారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత. ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటి ఆమె….కామారెడ్డి కలెక్టర్ శరత్, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్, నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ శ్వేత…వృక్షో రక్షతి రక్షిత: చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందని తెలిపారు. చెట్లను నాటిన వారు భవిష్యత్ తరాలకు మంచి ప్రాణవాయువును అందించిన వారు అవుతారని ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను మరింతగా విస్తరించి భావి తరాలకు ఉపయోగపడే విధంగా చేయాలన్నారు.

- Advertisement -