దక్షిణకొరియాలో కరోకా కల్లోలం..

141
south korea
- Advertisement -

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా ధాటికి చైనాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించగా తాజాగా దక్షిణకొరియాలో కరోనా కల్లోలం సృష్టించింది. ఒక్కరోజే 4 లక్షలకు పైగా కేసులు నమోదుకావడం అందరిని భయాందోళనకు గురిచేస్తోంది.

ఆ దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. మొత్తం కేసుల సంఖ్య 76లక్షల 29వేల 275కు చేరగా గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారని ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది ఐక్యరాజ్యసమితి. కరోనా టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని సూచించారు.

- Advertisement -