ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: హరీష్‌ రావు

89
corona
- Advertisement -

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కృషి చేస్తున్నాం అన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని టీఎస్ పార్డ్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందులను ఆన్ లైన్ చేస్తాము. 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.12 – 14 లోపు చిన్నారులకు కోవిడ్ టీకా వేసేందుకు తల్లిదండ్రులును సైతం భాగస్వామ్యం చేయాలని….. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

ప్రతి నెలా ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్ పెడతాం అని….. ప్రతి ఒక్కరు పనిభారంగా భావించకుండా, బాధ్యతగా ప్రజాసేవ చేయాలన్నారు. ఆరోగ్య శాఖపై సిఎం సుముఖంగా ఉన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తాం అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేసుకోవాలని అధికారులకు సూచించారు. టీబీ, మలేరియాలో పురోగతి సాధించాలి. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలని…. దానిపై గర్భిణీ స్త్రీకి అంగన్ వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -