దక్షిణాఫ్రికా ఏడో విజయం..

49
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఏడో విజయాన్ని నమోదుచేసింది. ఆప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. డసెన్‌ 76 నాటౌట్‌గా నిలవగా డికాక్‌ (41), ఫెలుక్వాయో 39 నాటౌట్‌, మార్క్మ్‌ (25), మిల్లర్‌ (24), బవుమా (23) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన ఆఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకోగా 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ 97 నాటౌట్‌ సెంచరీ మిస్ చేసుకోగా రహ్మానుల్లా గుర్బాజ్‌ (25), ఇబ్రహీం జద్రాన్‌ (15), రహ్మత్‌ షా (26), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (2), ఇక్రామ్‌ (12), మహమ్మద్‌ నబీ (2), రషీద్‌ఖాన్‌ (14) ఆకట్టుకోలేకపోయారు. డసెన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:జనసేన దారి.. గోదారే!

- Advertisement -