వెస్టిండీస్-దక్షిణాఫ్రికా సిరీస్ వాయిదా..

157
sa
- Advertisement -

కరోనా లాక్ డౌన్‌ కారణంగా అంతర్జాతీయంగా పలు క్రికెట్‌ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఐపీఎల్‌ ప్రారంభానికి లైన్ క్లియర్‌ కాగా మరోవైపు పలు టోర్నమెంట్‌లు వాయిదా పడుతూ వస్తూనే ఉన్నాయి. భారత్ -దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ అలాగే వాయిదా పడగా తాజాగా వెస్టిండీస్‌, శ్రీలంకలో సౌతాఫ్రికా జట్టు పర్యటన నిరవధికంగా వాయిదా పడింది.

దక్షిణాఫ్రికా జూలై-ఆగస్టులో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. అలాగే జూన్‌లో శ్రీలంకతో మూడు వన్డేలు,మూడు టీ20ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌ టూర్ క్యాన్సిల్ అయినట్లు సఫారీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.

- Advertisement -