బీసీసీఐ చీఫ్‌గా దాదా..?

209
Ganguly
- Advertisement -

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్ ను, సెక్రటరీ అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో..తదుపతి బీసీసీఐ బాస్‌ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ బోర్డు సభ్యుల్లో చర్చలు కూడా మొదలైయ్యాయి. అయితే ఈ రేసులో ప్రధానంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌ సౌరబ్ గంగూలీ పేరు వినబడుతోంది. బోర్డు సభ్యులు అధ్యక్షుడిగా గంగూలీ వైపు చూపుతుండడంతో..దాదాకే ఆ అవకాశం దక్కనున్నట్టు తెలుస్తొంది. ఇప్పటికే గంగూలీ బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. క్రికెట్‌ టీం ఎంపిక.బీసీసీఐ పదవులు ఎంపికలో కీలకపాత్ర పోషించిన గంగూలీ అయితే అధ్యక్షుడు సమర్ధవంతమైన పోషించగలడని అందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పైగా గంగూలీపై ఎలాంటి వివాదాలు..లేకపోవడంతో గంగూలీనే ఎన్నుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.  బోర్డు పూర్తి స్థాయి కార్యవర్గం కోసం ఈ నెల 19న కేసు తదుపరి విచారణ సందర్భంగా ఆదేశాలిస్తామని పేర్కొంది

Ganguly
బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిపై కొంతమంది మాజీ క్రికెటర్లు గంగూలీకే మద్దుతు తెలిపారు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై స్పందించారు. గత కొన్ని నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ పరువు పోయిందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమని… ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందే అని చెప్పారు. అనురాగ్ ఠాకూర్ స్థానాన్ని స్వీకరించడానికి సరైన వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు బదులిస్తూ… బీసీసీఐలో అత్యున్నత పదవులు చేపట్టడానికి స్ట్రాంగ్ బెంచ్ ఉందని, కానీ తన దృష్టిలో సౌరవ్ గంగూలీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తే బాగుంటుందనిపిస్తోందని చెప్పారు. 1999-2000 సంవత్సరాలలో టీమిండియాను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం పట్టి పీడిస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడని… ఆ తర్వాత జట్టు ముఖచిత్రాన్నే తను మార్చేశాడని గవాస్కర్ కితాబిచ్చారు.

- Advertisement -