నటుడు సోనూ సూద్ ,గాయకుడు మికా సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టారు. నేషనల్ క్రికెట్ లీగ్ (NCL) GT20 జట్లలో వారు సహ యజమానులుగా చేరినట్లు ప్రకటించారు.
ఈ పరిణామం ఉత్తర అమెరికాలో క్రికెట్ విస్తరణకు కీలక అడుగుగా భావిస్తున్నారు. అమెరికా, కెనడాలో పెరుగుతున్న క్రికెట్ ఆదరణను దృష్టిలో ఉంచుకుని NCL ఈ నిర్ణయం తీసుకుంది.
నేషనల్ క్రికెట్ లీగ్ ప్రకటన ప్రకారం…సోనూ సూద్ మరియు మికా సింగ్ చేరికతో లీగ్కు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని తెలిపారు. దక్షిణాసియా, కరీబియన్ ప్రాంతాల అభిమానులను ఉత్తర అమెరికాతో కలిపే వేదికగా NCL GT20 అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
సోనూ సూద్ మాట్లాడుతూ…క్రికెట్ ప్రజలను కలిపే శక్తి కలిగిన క్రీడ. ఉత్తర అమెరికాలో ఈ లీగ్ ద్వారా కొత్త ప్రేక్షకులను చేరుకోవడం చాలా ముఖ్యమైన అడుగు అని అన్నారు. మికా సింగ్ కూడా స్పందిస్తూ…క్రికెట్ మరియు ఎంటర్టైన్మెంట్ కలయికకు ఉత్తర అమెరికా మంచి వేదిక. ఈ లీగ్లో భాగమవడం గర్వంగా ఉంది అని తెలిపారు.
Also Read:ఇరాన్తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు
మొత్తానికి, ఈ నిర్ణయం ద్వారా నేషనల్ క్రికెట్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రాధాన్యతను పెంచుకునే దిశగా ముందుకు సాగుతోంది.

