దేశ్‌ కే మెంటర్స్‌..బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ

165
sonu
- Advertisement -

ఢిల్లీ ప్రభుత్వం దేశ్‌కే మెంటర్స్ ప్రొగ్రామ్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతోంది. ఈ ప్రొగ్రామ్‌ఖు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్‌ను నియమించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లక్ష‌లాది మంది విద్యార్థుల‌ను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్ష‌కుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని సోనూ సూద్ తెలిపారు.

విద్యార్థుల‌కు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో క‌లిసి ఆ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సోనూ సూద్ తెలిపారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు సోనూ. రోగులకు మందులు పంపిణీ చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు తరలించి ఎంతో మందికి ఊపిరి పోశారు. ఆకలితో అలమటించిన పేదలకు అన్నం పెట్టారు. అందుకే సోనూ రియల్ హీరోగా మారిపోయారు.

- Advertisement -