తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ

277
- Advertisement -

తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.

సోనియా,ఖర్గే, రాహుల్, ప్రియాంక, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పారు.తెలంగాణలో సోనియా పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాం అన్నారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు..తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీకు రుణపడి ఉంటామన్నారు. ఆరు గ్యారంటీలపై చర్చించాం, మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో సిఎం ప్రకటిస్తారన్నారు.

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్ లో 28 న జరుగుతుంది, యాభై వేల మందిని తరలిస్తాం అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభ్యులకు డిప్యూటీ సీఎం వివరించారని..ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ వివరించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని…ఎలక్ట్రిసిటీ, ఫైనాన్స్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామన్నారు.

Also Read:కేబినెట్‌లో చోటు.. నేతల ఫైట్!

- Advertisement -