ఉపాధి హామీ పనుల్లో సామాజిక దూరం..

481
- Advertisement -

కరోన ఉన్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలు సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసేందుకు వీలుగా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల ఇంచార్జ్ ఎంపీడీవో గన్నోజు బ్రహ్మచారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచనలను అమలు చేశాడు.

బోరు మోటార్లు తీసే పరికరాలను ఉపయోగించి దానికి కింద ఒక పళ్ళెం మాదిరిగా తయారుచేసి తక్కువ ఖర్చుతో ఉపాధిహామీ కూలీలు కరోనా వైరస్ బారిన పడకుండా సామాజిక దూరం పాటించే విధంగా తమ పనులు ఈ యంత్రం సాయంతో చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ యంత్రం సాయంతో కూలీలు పని చేస్తుండడం విశేషం.

- Advertisement -