‘నోటుకు పోటు’ సక్సెస్..

195
- Advertisement -

ఎస్ బి కె ఫిలిం కార్పొరేషన్ లో, ఎస్.కె బషీద్ దర్శకత్వంలో, ఎస్ కె కరీమున్నీసా నిర్మించిన చిత్రం “నోటుకు పోటు”. గత శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన సందర్భంగా దర్శకుడు ఎస్. కె. బషీద్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ‘నోటుకు పోటు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల కోరిక మేరకు..ఈ వారం థియేటర్స్ కూడా పెంచుతున్నాము. మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని..ఈ చిత్రం తో మరోసారి తెలుసుకున్నాము. ఈ సక్సెస్ ఆనందం తో..మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని తెలియచేస్తున్నాము…అని అన్నారు.

అర్జున్, మనీషా కొయిరాలా, శ్యామ్, అక్స బట్, సీతా, ఎ ఎమ్ ఆర్ రమేష్ తదితరులు ఈ చిత్రం లోని తారాగణం.

SK Basheed thanks for Notuku Potu Sucsses

- Advertisement -