65వేల సీడ్‌బాల్స్..సిరిసిల్ల చిన్నారికి అరుదైన గౌరవం

65
ktr siricilla
- Advertisement -

సిరిసిల్ల జిల్లా సుద్దాల కి చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని 65 వేల సీడ్ బాల్స్ తయారుచేసింది.తాను తయారు చేసిన సీడ్ బాల్స్ కొన్ని సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది.పర్యావరణంపై ప్రేమతో భావి తరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్న బ్లెస్సీని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అబినందించడమే గాక స్వయంగా హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు.తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ,ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటి అరుదైన గౌరవాన్ని అందుకుంది.అనంతరం తాను తయారుచేసిన సీడ్ బాల్స్ ని ఎంపీ సంతోష్ కుమార్ కి బహుకరించారు బ్లెస్సీ.

చిన్నతనం నుండే ప్రకృతి పట్ల బ్లెస్సీ ప్రేమను పెంచుకోవడం అభినందనీయం అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.సీఎం కేసీఆర్ హరితహారం,గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.చిన్నతనం నుండే ప్రకృతి పట్ల ప్రేమను నింపిన బ్లెస్సీ తల్లిదండ్రులు ప్రకాష్,మమత ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

సీఎం కేసీఆర్ హరితహారం,గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమం,సీడ్ బాల్స్ తయారుచేసామని బ్లేస్సి తండ్రి ప్రకాష్ తెలిపారు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆహ్వానించి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇదో గొప్ప వరం లా బావిస్తున్నటు ప్రకాష్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని బ్లేస్సి తెలిపారు…

కార్యక్రమం అనంతరం బ్లేస్సిని మంత్రి కేటీఆర్ వద్దకు స్వయంగా తీసుకెళ్లారు ఎంపీ సంతోష్ కుమార్. మంత్రి కేటీఆర్ కి ,ఎంపీ సంతోష్ కుమార్ కి సీడ్ బాల్స్ బహుకరించారు బ్లేస్సి.పర్యావరణం పరిరక్షణకు కృషి చేస్తున్న బ్లేస్సి ని అభినందించిన మంత్రి కేటిఆర్..ఏ అవసరమొచ్చిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.

- Advertisement -