బహిర్భూమి రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల

249
Sircilla
- Advertisement -

రాజన్న సిరిసిల్లా జిల్లా తెలంగాణలోనే తొలి బహిరంగ బహిర్బూమి రహిత జిల్లాగా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్ మరియు అధికార యంత్రాంగాన్ని మంత్రి కెటి రామారావు అభినందించారు. స్వచ్చ జిల్లాగా సిరిసిల్లా రాష్ర్టానికి అదర్శంగా నిలుస్తుందన్న మంత్రి, ఇందుకు సహకరించి నడిచిన జిల్లా ప్రజలకు మంత్రి దన్యవాదాలు తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి అక్కడి నుండి జిల్లా కలెక్టర్, ప్రజాప్రతనిధులతో మాట్లాడారు. సూక్ష్మస్ధాయి ప్రణాళిక , ప్రజల భాగసామ్యంతో ఇది సాద్యం అయిందని తెలిపారు.

గత ఎడాదిలోనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాను బహిరంగ బహిర్బూమి రహిత నియోజకవర్గంగా మార్చిన మంత్రి, ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను సైతం బహిరంగ బహిర్బూమి రహిత జిల్లాగా మార్చడంలో అధికారులతో ఏప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ యంఏల్యే చేన్నమనేని రమేష్ సైతం తన నియోజక వర్గాన్ని బహిరంగ బహిర్బూమి రహితంగా మార్చడంలో జిల్లా యంత్రాగంతో కలిసి కృషి చేశారు. గత ఏడాదిలోనే మంత్రి కెటి రామారావు సమక్షంలో వేములవాడను బహిరంగ బహిర్బూమి రహిత నియోజక వర్గంగా ప్రకటించారు. మంత్రి కెటి రామారావు పంచాయితీరాజ్ మంత్రిగా సూమారు 6 కోట్ల రూపాయాలను ప్రత్యేక నజరానాగా నియోజక వర్గ గ్రామాలకోసం అందించారు.

సిరిసిల్లా కొత్త జిల్లాగా ఎర్పడిన సందర్భంగా రెండు మండలాలు బోయినపల్లి( చొప్పదండి) ఇల్లంత కుంట( మానకొండూరు)లు జిల్లాలో చేరడంతో సమారు 22000 వేల మరుగుదొడ్ల కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా మిగిలిన ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు పూర్తి స్ధాయిలో కట్టడం ద్వారా ఈ గతం వారంలోనే సిరిసిల్లా జిల్లా ఈ ఘనతను సాధించిన తొలి జిల్లాగా రికార్డ్ సృష్టించారు. గత దసరా నాటి నుంచి మిగిలిన ఈ 22వేల మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో రాష్ర్టంలోనే తొలి బహిరంగ బహిర్బూమి రహిత జిల్లాగా మారింది. ఇందుకోసం మంత్రి మార్గ దర్శనంతో ప్రత్యేకమై వ్యూహాన్ని అధికారుల అనుసరించారు. ముందుగా ఇంటింటి సమీకృత సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వే ద్వారా అర్హులైన వారందరికి స్వచ్చభారత్ మిషన్ కింద మరుగుదొడ్లను నిర్మించారు. గ్రామాల వారీగా కమీటీలు ఏర్పాటు చేసుకుని, సమిష్టిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరింగింది.

Sircilla

గ్రామాల్లోని వాహనదారులు( ట్రాక్టర్లు, అటోలు,డిసియంలు, లారీల యజమానులు) ఇసుక, ఇటుక, ఇతర సామాగ్రి రవాణాను ఉచితంగా చేశారు. సిమెంట్ తోపాటు మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరం అయిన పైపులు, డోర్లను హోల్ సేల్ ధరలకు కోనుగోలు చేయడంతో ఖర్చులను కొంత వరకు తగ్గించగలిగారు. కొన్ని చోట్ల 24 గంటల్లోనే ఏకభిగిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి వందల మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం అవగాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని వాటి ఉపయోగం కోసం కూడా చేపట్టారు. దీంతో కొన్ని గ్రామాల్లో బహిరంగ బహిర్బూమికి వెళ్లే వాళ్లకు జరిమాన వేస్తామంటూ బ్యానర్లు, డప్పులతో ప్రచారం సైతం చేశారు. దీంతో చాల వరకు ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఉపయోగం చేయడం ప్రారంభించారు.

ఈ మెత్తం ప్రక్రియలో జడ్పిటిసీలు, యంపిటిసిలు, సర్పంచ్లు వార్డు మెంబర్లు చాల చురుగ్గా పాల్గోన్నారు. వీరంతా అధికారులతో కలసి శిక్షణ కార్యక్రమాలు,అవగాహణ సదస్సుల్లో పాల్గోన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించారు. పంచాయితీరాజ్, అర్ డబ్యూయస్, ఐసి డబ్యూయస్, సెర్ప్, పోలీస్, రెవెన్యూ వంటి శాఖల అధికారులు నిర్ణీత గడువులో పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గ్రామాలను దత్తత తీసుకుని మరీ మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ మెత్తం ప్రక్రియను మంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షణ చేసింది. మంత్రి కెటియార్, యంఏల్యే చెన్నమనేని రమేష్ లో క్షేత్రస్ధాయిలో పర్యటించి సభలు నిర్వహించారు.

ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ , అధికారులను, ప్రజలను అభినందించిన మంత్రి కెటి రామారావు, ఇకపైన అరోగ్య శాఖలో స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో రాష్ర్టానికి అదర్శంగా నిలిచిన రాజన్న సిరిసిల్లా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు.

- Advertisement -