ఎయిర్‌ ఇండియాపై సిరాజ్ అసహనం

5
- Advertisement -

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గౌహతి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై ఆయన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.

విమానం ఆలస్యం అయినప్పటికీ, ప్రయాణీకులకు ఎలాంటి సరైన సమాచారం లేదా మద్దతు లభించకపోవడంపై సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అనుభవాన్ని తన జీవితంలో ఎదురైన అత్యంత చెత్త అనుభవంగా ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ప్రయాణీకులను ఇలా గంటల తరబడి వేచి ఉంచడం సరికాదు. కనీసం విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే స్పష్టత కూడా ఇవ్వలేదు అని సిరాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక అంతర్జాతీయ క్రీడాకారుడికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే, సామాన్య ప్రయాణీకుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రయాణీకుల పట్ల విమానయాన సంస్థ వైఖరిని ఆయన విమర్శిస్తూ, ఈ ఆలస్యం కారణంగా తన వ్యక్తిగత పనులకు ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Also Read:రివాల్వర్ రీటా..పక్కా కమర్షీయల్

- Advertisement -