మొక్కలు నాటిన గాయని మధుప్రియ..

388
Singer Madhupriya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం 3వ విడతలో భాగంగా ప్రముఖ గాయని మధుప్రియ చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతితో కలిసి ఈ రోజు ఉప్పల్‌లో మూడు మొక్కలను నాటారు. అనంతరం మధుప్రియ మాట్లాడుతూ.. ఎంపీ సంతోషన్న చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని ఇలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ అందులో నాలాంటి వారందరిని భాగస్వామ్యం చేస్తునందుకు సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు అని తెలిపారు.

మొక్కల్ని నాటడం అలాగే నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షించారు. ఈ సందర్బంగా మధుప్రియ మరియ కార్పొరేటర్ గోపు సరస్వతి మరో ముగ్గురికి మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ నుండి మొదటి మహిళ పైలట్ సంజన,జిహెచ్‌ఎంసి ఉప్పల్ కమిషనర్ అరుణకుమారి అలాగే నటుడు మధులకు ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -