కేంద్రం దిగిరావాలి..సింగరేణి కార్మికుల సమ్మె

76
sccl
- Advertisement -

సింగరేణి కార్మికులు సమ్మె బాటపట్టనున్నారు. యాజమాన్యంతో ఇవాళ జరిగిన చర్చలు విఫలం కావడంతో 72 గంటల పాటు సమ్మె చేసి తీరుతామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. 9,10,11 వ తేదీలలో తలపెట్టిన సమ్మె ద్వారా అయిన కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు. 4 బొగ్గు బ్లాక్ ల వేలం వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేయడంతో ఉద్యోగుల బతుకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం మనాలని నేతలు సూచించారు.

ఇవాళ అన్ని యూనియన్లు తిరిగి సమావేశమై సీఎండీ, సీఎం, అలాగే ఎంపీలకు, కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం అందజేయాలని నిర్ణయించారు.

- Advertisement -