దీపావళి బోనస్…నేరుగా కార్మికుల ఖాతాల్లోకే

476
sccl
- Advertisement -

సింగరేణి కార్మికులకు వారి కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సీఎండీ ఎన్ శ్రీధర్. కార్మికులకు దీపావళి బోనస్ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుందని తెలిపారు. ఒక్కో కార్మికుడికి రూ 64,700 బోనస్‌ను అందనుండగా దీపావళి బొనస్ గా పిలిచే ఈ పి.ఎల్.ఆర్. స్కీం ( పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం) కోసం 258 కోట్ల రూపాయలను యాజమాన్యం విడుదల చేసింది.

ఇటీవలనే 494 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను సింగరేణి పంపిణీ చేసింది. బోనస్ పైసలలో కొంత మొత్తం ప్రభుత్వ పొదుపు సంస్థల్లో దాచుకోవాలని యాజమాన్యం కార్మికులకు సూచించింది.

 తమ కుటుంబాల్లో  దీపావళి వెలుగును నింపిందని… గతేడాది కంటే మరింత బోనస్ ఇవ్వడం ఆనందంగా ఉందని కార్మికులు చెబుతున్నారు.

- Advertisement -