కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. కార్యకర్తల సమావేశంలో సహనం కొల్పోయిన సిద్దరామయ్య ఓ మహిళ నుండి మైక్ లాక్కోవడంతో పాటు చీరకొంగును లాగాడు. మహిళ సమస్యలు చెబుతుండగా సహనం కొల్పోయిన ఆయన ప్రవర్తించిన తీరు వివాదానికి కేంద్రబిందువైంది. సిద్దరామయ్య అనుచిత ప్రవర్తనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
తాను పంచాయతీ మెంబర్ని అని ఎలాంటి తప్పు చేయలేదన్నారు బాధిత మహిళ జమీలా.సిద్దరామయ్య హుందాగా ప్రవర్తించలేదని చెప్పిన ఆమె ఓ సీనియర్ నేత ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు.
మరోవైపు సీఎం కుమారస్వామి-సిద్దరామయ్యల మధ్య వివాదం తారాస్ధాయికి చేరుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య తమ నాయకుడని, ఆయనే సీఎం కావాలంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని..కాంగ్రెస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని సీఎం కుమారస్వామి హెచ్చరించారుదే. ఈ నేపథ్యంలో మీడియాపై మండిపడ్డారు సిద్ధరామయ్య.మీరు (మీడియా) సమస్యను సృష్టిస్తున్నారు. మీరు ఒకరు, ఇద్దరు, ముగ్గురిని ఈ విషయాన్నిగురించి అడిగి తెలుసుకోండి. అసలు మా మధ్య ఎలాంటి సమస్య లేదన్నారు.
#WATCH Former Karnataka Chief Minister and Congress leader Siddaramaiah misbehaves with a woman at a public meeting in Mysuru. #Karnataka pic.twitter.com/MhQvUHIc3x
— ANI (@ANI) January 28, 2019