వీరనారి ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ జీవితచరిత్ర ఆధారంగా ‘మణికర్ణిక’ చిత్రం నిర్మితమైంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. క్రిష్ – కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమా, రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసుళ్లు రాబడుతోంది.
ఢిల్లీ, ఎన్సీఆర్, యూపీ, పంజాబ్, రాజస్ధాన్లలో మణికర్ణిక భారీ వసూళ్లను రాబడుతోందని విడుదలైన మూడు రోజుల్లో హిందీ, తమిళ్, తెలుగు వెర్షన్లు కలిపి భారత్లో ఈ సినిమా మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయిర. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగిస్తే 100 కోట్ల ట్రేడ్ అందుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.