ప్రభాస్‌తో శ్రుతి హాసన్ మళ్లీ

15
- Advertisement -

శ్రుతి హాసన్ కెరీర్‌‌‌‌ ప్రారంభించి పదిహేనేళ్లు దాటినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌‌తో స్టార్‌‌‌‌ హీరోయిన్‌‌గా సత్తా చాటుతోంది. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్‌‌పీరియెన్స్ ఆమెకుంది. రీసెంట్ గా సలార్ చిత్రంలోనూ శ్రుతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ – శ్రుతి హాసన్ కలయిక పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ జంట మరోసారి స్క్రీన్ పై కనిపించనున్నారు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న రాజసాబ్ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ న్యూస్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజాసాబ్ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌లో జరుగుతోంది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుంది. ఈ హారర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. దీనికితోడు మారుతి రాసుకున్న కథలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. అలాగే ప్రభాస్ ది డబుల్ రోల్. ప్రభాస్ కి డబుల్ రోల్ కొత్త కాదు, కానీ తాత మనవళ్ల కథలో నటించడం మాత్రం పూర్తిగా కొత్తే. పైగా ప్రభాస్ తండ్రి గెటప్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. శ్రుతి హాసన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంద‌ని నెట్టింట రీసెంట్‌గా ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ ఇది ఒక‌టే సినిమాగా వ‌స్తుంద‌ని, రెండో భాగం కోసం హింట్ ఇచ్చి వ‌దిలేస్తార‌ట‌. సినిమా రిజ‌ల్ట్, ప్ర‌భాస్ డేట్స్ అన్నీ కుదిరితేనే రెండో భాగం ఉంటుంద‌ట. కాకపోతే, దర్శకుడు మారుతి కి పాన్ ఇండియా సినిమా పూర్తిగా కొత్త. కాబట్టి, మారుతి పై కచ్చితంగా ఈ సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. అలాంటి ఒత్తిడిలో ఉన్న మారుతి ని నమ్ముకుని.. ప్రభాస్ ఏ న‌మ్మ‌కంతో ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడో ప్రభాస్ కే తెలియాలి.

Also Read:ఆ రెండు స్థానాల్లో నిలిచేదెవ్వరు?

- Advertisement -