కేజ్రీ అంటే మోడీకి భయం:శివసేన ఎంపీ

18
- Advertisement -

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడుతున్నారన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదానం జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటానని తెలిపారు.

అర‌వింద్‌ కేజ్రీవాల్ ..జైలు నుండి పనిచేయడం ఇప్పుడే ప్రారంబించారన్నారు. ప్రజలు ఆయనకు మద్దతుగా నిలబడతారని, స్వాతంత్ర్య పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయ‌కులు మ‌రింత బ‌లంగా బ‌య‌ట‌కు వ‌చ్చారని తెలిపారు. తన మాట వినని నాయకులను ఈడీ ద్వారా ప్రధాని భయపెడుతున్నారన్నారు. అందుకే 31న జరిగే మిత్ర పక్షాల ర్యాలీలో అందరూ పాల్గొనాలన్నారు.

Also Read:BRS:పూర్తి స్థాయి ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

- Advertisement -