ఇక ఆ తప్పు చేయను…

213
Shivaay girl excited over Tamil debut
- Advertisement -

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అఖిల్’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ సాయేషా సైగల్. ప్రముఖ హిందీ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలే ఈ సాయేషా సైగల్. సినిమా పెద్ద ప్లాప్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న అఖిల్ తో పాటు సాయేషాకు కూడా నిరాశ తప్పలేదు.  ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు కలిసిరాలేదు. కానీ అనుకోకుండా బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ సరసన శివాయ్‌లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాతో కుర్రకారును మెప్పించిన సాయేషా తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.

జయంరవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఇందులో హీరో జయంరవికి చాలా తక్కువ మాటలు, సాయేషాకు చాలా ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాదు, ఇందులో పాటల సన్నివేశాల్లో డాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట.

ఆ పాట కొరియోగ్రాఫర్‌ డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవానే అబ్బురపడేలా నటించిందట. ఈ టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టార్‌ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది.మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట.టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో కూడా  అవకాశాలు వస్తున్నాయట.

అయితే ఈ భామ మాత్రం కోలీవుడ్‌ వైపే మొగ్గుచూపుతోంది. కోలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌గా  అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండడంతో  టాలీవుడ్‌, బాలీవుడ్‌లో సినిమాలు ఇప్పట్లో చేయనంటోంది. కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని  తేల్చి చెబుతోంది ఈ భామ. మరి కోలీవుడ్‌లోనైనా ఈ భామ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతుందా లేదా చూడాలి.

- Advertisement -