బ‌ల‌పరీక్ష‌కు సిద్ధం! : సంజ‌య్ రౌత్

65
Sanjay Raut
- Advertisement -

మ‌హారాష్ట్రలో రాజ‌కీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ధంగా ఉన్నామ‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు స‌వాల్ విసిరారు శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్. బ‌ల‌ప‌రీక్ష‌లో ఠాక్రే స‌ర్కార్ విజ‌యం సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

త‌మ‌ను వీడిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ గూటికి చేరేలా అవ‌కాశం ఇచ్చామ‌ని, అయినా వారు స్పందించ‌డంలో చాలా జాప్యం జ‌రిగింద‌ని అన్నారు. ఎంవీఏ ప్ర‌భుత్వం మిగిలిన రెండున్న‌రేండ్ల ప‌ద‌వీ కాలం పూర్తి చేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌లో తాము విజ‌యం సాధిస్తామ‌ని రెబెల్ ఎమ్మెల్యేలు త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆరోపించారు.

ఇక ఇది ఇలాఉండ‌గా రెబెల్ శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన వ‌ర్గం డిప్యూటీ స్పీక‌ర్‌కు లేఖ రాసింది.

- Advertisement -