మహారాష్ట్ర ట్విస్ట్….స్పందించిన శివసేన

585
shiv sena
- Advertisement -

మహారాష్ట్రలో రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలపై స్పందించింది శివసేన. అజిత్ పవార్‌ని బీజేపీ బెదిరించి లొంగదీసుకుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. అజిత్ పవార్ హావభావాలు చూస్తేనే అర్దమవుతుందని చెప్పారు. ఈడీ ద్వారా అజిత్ పవార్‌ని బీజేపీ భయపెట్టిందని సంజయ్ తెలిపారు.

గుట్టుచప్పుడు కాకుండా ప్రమాణస్వీకారం చేయడమెందుకని ప్రశ్నించిన సంజయ్…ఇది ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిర్ణయం కాదన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక శరద్ పవార్ ఉన్నట్లు తాము భావించట్లేదని చెప్పారు.

మరోవైపు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో ఫోన్లో మాట్లాడారు శరద్ పవార్. అజిత్ పవార్…బీజేపీతో వెళ్తాడన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఎన్సీపీతో అజిత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదని వెల్లడించారు.

- Advertisement -