బీజేపీకి ఎన్సీపీ మద్దతివ్వలేదు: శరద్ పవార్

585
sharad pawar
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మహాసీఎంగా ఉద్దవ్ ఠాక్రేను ప్రకటించిన గంటల్లోనే రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు అజిత్ పవార్.

ఊహించని రాజకీయ పరిణామాలతో శివసేనకు గట్టి షాక్ తగలగా అజిత్ పవార్ నిర్ణయంతో ఎన్సీపీకి సంబంధంలేదని తెలిపారు శరద్ పవార్. బీజేపీకి మద్దతివ్వాలన్నది అజిత్ పవార్ సొంత నిర్ణయమని..ఎన్సీపీకి ఈ నిర్ణయంతో సంబంధంలేదని స్పష్టం చేశారు.

అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయాన్ని శరద్ పవార్‌ సమర్దించరని ఎన్సీపీ సీనియర్ నేత ప్రపుల్ పటేల్ తెలిపారు. బీజేపీకి మద్దతివ్వాలన్నది అజిత్ సొంత నిర్ణయమన్నారు.

- Advertisement -