అక్టోబర్‌లో శిల్పారామం పున: ప్రారంభం

167
Shilparamam
- Advertisement -

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముతపడ్డ పర్యటక కేంద్రం శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుంది. పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తరువాతే లోపలికి అధికారులు అనుమతించనున్నారు. ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ప‌ర్యాట‌కులు క‌చ్చితంగా చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాలి.

అలాగే వ‌చ్చే నెల 6వ తేదీ నుంచి హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి రానుంది. కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ‌నివారం నుంచి అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంద‌ర్శ‌కుల‌కు శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని, మాస్కులు ధ‌రించిన వారినే లోప‌ల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

- Advertisement -