శ్రీలంకలో శిఖర్ ధావన్ బృందం

339
dhawan
- Advertisement -

శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేరుకుంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 20 మంది సభ్యుల టీమ్‌ శ్రీలంక చేరుకుంది. శ్రీలంక టూర్‌లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది ధావన్ సేన.

గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్‌ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్న భారత జట్టు… ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. పృథ్వీషా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి ఆటగాళ్లు ఇంతకుముందులా తమ స్థానాలను పదిలపర్చుకోవాలని ఆశిస్తున్నారు.

- Advertisement -