ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: శేఖర్ మాస్టర్

343
shekar master
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.

అనంతరం మాట్లాడుతూ ఒక్కడితో మొదలు పెట్టి దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ యాంకర్ ప్రదీప్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటినట్లు తెలిపారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నానని తెలిపారు.ప్రతి ఒక్క డాన్సర్ లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మరో ముగ్గురు కొరియోగ్రాఫర్ లు ( సత్యం , బాబా భాస్కర్ , రఘు ) లు మొక్కలు నాటాలని శేఖర్ మాస్టర్ అన్నారు.

- Advertisement -