ఇది నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది- శ‌ర్వానంద్‌

151
- Advertisement -

నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ చిత్రం నిలుస్తుంద‌ని క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ అన్నారు. శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన ఆడ‌వాళ్ళు మీకు జోహార్లుప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుకలో హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ, సుకుమార్‌కు నేను అభిమానిని. ఆయ‌న వ‌చ్చి ఆశీర్వ‌దించ‌డం ఆనందంగా వుంది. కీర్తి గారికి ధ‌న్య‌వాదాలు. సాయిప‌ల్ల‌విని న‌టిగా చూడ‌ను. త‌ను మ‌న‌సుతో మాట్లాడే వ్య‌క్తి. మంచి స్నేహితురాలు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రాణం పోశాడు. 15 ఏళ్ళ‌నాడు దేవీ ఓ మాట ఇచ్చాడు. నీకు సినిమా చేస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తాన‌ని అన్నారు.

అది ఈ సినిమాతో నెర‌వేర్చాడు. ఈ సినిమాలో గొప్ప న‌టుల‌తో న‌టించే అవ‌కాశం క‌లిగింది. సుధాక‌ర్‌ వ‌ల్లే ఈ సినిమా చేశాను. ఆయ‌న నన్ను న‌మ్మారు. రాసుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది. మార్చి 4న వ‌స్తున్నాం. ఇంత‌కాలం మిస్ అయిన ఫ్యామిలీ సినిమాను మీకోసం ఇస్తున్నాం. ఇక ర‌ష్మిక ఎప్పుడూ న‌వ్వుతూనే వుంటుంది. ఆమెతో న‌టించ‌డం ఆనందంగా వుంది. థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూశాక న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వెళ‌తారు అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని పేర్కొన్నారు.

కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ చిత్ర సంగీతం ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా విడుద‌లైంది. నిన్న శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగిన‌ కార్య‌క్ర‌మంలో చిత్ర టైటిల్ సాంగ్‌ను వ్యాపారవేత్త రాజ సుబ్ర‌హ్మ‌ణ్యం, కెమెరామెన్ సుజిత్ సారంగ్ సంయుక్తంగా ఆవిష్క‌రించారు. మ‌రో గీతాన్ని ప్ర‌ముఖ నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని (మైత్రీ మూవీస్), వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి (శ్యామ్ సింగ‌రాయ్‌) ఆవిష్క‌రించారు. చిత్ర ట్రైల‌ర్‌ను ముఖ్య అతిథులు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్, కీర్తిసురేష్‌, సాయిప‌ల్ల‌వి సంయుక్తంగా ఆవిష్క‌రించారు.

- Advertisement -